Powered By Blogger

15 డిసెంబర్, 2016

గురు బ్రహ్మ గురు విష్ణుః

పిల్లల్లో మానసిక చైతన్యం కేవలం పాఠాలతోనో, పాఠశాలల్లోనో రాదు. గురువుతో వారికున్న అనుబంధం వల్ల వస్తుంది. మంచి గురువు సాన్నిహిత్యంతో నరేంద్రుడు వివేకానందుడయ్యాడు. గురువులో ఉండే శక్తి అలాంటిది. అందుకే... పెద్దలు భగవంతుని తర్వాత స్థానం గురువుకిచ్చారు.


గురు బ్రహ్మ, గురు విష్ణు
గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః

తల్లిదండ్రుల తర్వాత ప్రత్యక్ష దైవం గురువు. గురువు మీద భక్తి ఉంటేనే చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. గురువుని నమ్మిన వాడు, గురువుని భక్తి, గౌరవాలతో చూసేవాడు ఎప్పటికైనా గొప్పవాడు అవుతాడు. పిల్లలకు నేర్పించాల్సిన, ప్రతి రోజూ చదివించాల్సిన శ్లోకమిది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి