Powered By Blogger

16 డిసెంబర్, 2012

ఆనందుని బాట...ఆధునిక భగవద్గీత

ఒకసారి వివేకానందుడికి, ఓ రాజుకి మధ్య ఓ చర్చ వచ్చింది. 
భారతీయులు విగ్రహాలను పూజిస్తారు. మూర్ఖులు. రాళ్లల్లో
ఏముంది, దేవుడి చిత్రపటాల్లో ఏముంది.. అంతా
మూఢనమ్మకం కాకపోతే అన్నాడట... ఆ రాజు. 
వివేకానందుడు అంతా మౌనంగా విన్నాడు. అప్పుడన్నాడు.
రాజా మనం మీ ఉద్యానవనానికి వెళ్దామా అని. అదేం భాగ్యం పదండి అన్నాడు
రాజు. ఉద్యానవనంలో రాజు గారి తండ్రి, తాత, ముత్తాతల విగ్రహాలు
వరుసగా ఉన్నాయి.వాటికి నమస్కరించుకుంటూ వెళ్తున్నాడు రాజు. వివేకానందుడు
ఒక విగ్రహం ముందు ఉమ్మేశాడు. వెంటనే ఆ రాజు... స్వామీ
మీరు చాలా విజ్ఞులునుకున్నాను.. ఇలా మా పూజ్యులైన
పూర్వీకుల విగ్రహం ముందు ఇలా ఉమ్మి వేయడం భావ్యమా
అని అడిగాడు. దానికి వివేకానందుడు.. అదేంటి రాజా.. మాట తప్పుతున్నారు.
పది నిమిషాల క్రితం మీరే కదా.. విగ్రహారధన మూర్ఖత్వం అన్నారు.
అందుకే నాకు జ్ఞానోదయమై ఇలా చేశాను. నేను ఉమ్మింది మీ
తాతగారి మీద కాదే... ఉట్టి రాయి మీద అన్నాడు. రాజుకి అర్థమైంది.. వివేకానందుని క్షమించమన్నాడు. అప్పుడాయన..
రాజా... విగ్రహారాధనలో నువ్వు రాయిని చూస్తున్నావు. అందుకే
అది రాయిలానే కనిపిస్తోంది. కానీ నేను జ్ఞానాన్ని చూస్తున్నాను.
అందుకే నాకు దేవుడు కనిపిస్తాడు. దృక్కోణం ముఖ్యం. రాయారప్పా
అన్నది కాదు.అధ్యాత్మక చింతనకి ఏకాగ్రత కలిగించే విగ్రహమైనా, మనోవిగ్రహమైనా
ఏదైనా... స్వాంతన కల్గించేదే. ఇదే ఉపనిషత్ సారం. గ్రహించు. అని చెప్పాడట.
లేని నీ తాత విగ్రహాన్ని అవమాన పరిస్తేనే ఆగ్రహం వచ్చిందే. జగమంతా
వ్యాపించి ఉన్న దేవుని విగ్రహాన్ని పూజిస్తే తప్పేంటి అన్నాడట. పాజిటివ్ థింకింగ్ అంటే ఇది. మరి కొద్ది రోజుల్లో.. ఆనందుడి 150వ
జయంతి. యువతకు మార్గదర్శకుడైన ఆయన సందేశం.. భారతీయ
యువతకు ఆధునిక భగవద్గీత లాంటిది.