Powered By Blogger

25 నవంబర్, 2012

ముందు బ్లాగుకి కొనసాగింపు

మరి ఐదుగురు భర్తలు కదా.. ద్రౌపది ఎలా నెట్టుకొచ్చిందీ అనే సందేహం
అందరికీ వస్తుంటుంది. దానికి పాండవులు ఒక పద్ధతి పెట్టుకున్నారు.
సంవత్సరానికి ఒకరి ఇంట ద్రౌపది ఉంటుంది. ఈ సంవత్సరంలో
మిగిలిన వారు ఆ ఇంటివైపు వెళ్లకూడదు. ఒక వేళ వెళితే..
ఆ సోదరుడు ఆరునెలల పాటు పుణ్యక్షేత్రాలు తిరిగి రావాలి.
ఒక సారి ధర్మరాజు, ద్రౌపది ఆయుధాగారాన్ని వీక్షించేందుకు
వెళ్లారు. అదే సమయం అర్జునుడికి అటువైపు పని పడింది.
అక్కడే ధర్మరాజు, ద్రౌపది ఉన్నారన్న విషయం అర్జునుడికి
తెలియదు. అలా వెళ్లిన అర్జునుడు ధర్మరాజు, ద్రౌపదిలను చూస్తాడు.
నిజానికి అదేం తప్పు కాకపోయినా.. పద్ధతి మీరకూడదన్న నియమంతో
అర్జునుడు ఆరునెలలు పుణ్యక్షేత్రాలకు వెళ్లాడు.