Powered By Blogger

17 సెప్టెంబర్, 2012

ఇదీ అసలు భారతం...

నా స్నేహితుల్లో ఒకతనికి ఒక సందేహం వచ్చింది. ఒరేయ్... మహాభారతంలో
శ్రీకృష్ణుడు పాండవులు ఎప్పుడు మొట్టమొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు.
అని అడిగాడు. తత్తరపోడం నా వంతైంది. చిన్నప్పుడు భారతంలో ఘట్టాలైతే
చదివాను గాని.. నిజానికి వాడి ప్రశ్నకు సమాధానం గుర్తుకు  రాలేదు.
కాదు.. తెలీదు అంటే నిజాయితీగా ఉంటుంది.
వాడికి సందేహం తీర్చడానికని కాదుగాని.. నాకే తెలుసుకోవాలని
అనిపించింది. ఎవరినో పండితులను అడగటం ఎందుకని...
వ్యాస సంహిత, నన్నయతిక్కనఎర్రాప్రెగడ అనువాదితమైన
భారతం చదవడం మొదలుపెట్టాను. ధ్రోణపర్వం వరకు వచ్చేశాను.
అయితే.. చదువుతుంటే చాలా షాక్ అవుతూ వచ్చాను.
చిన్నప్పుడు సినిమాల్లో భారతం ఎంత వక్రీకరణకు గురైందో,
ఏరకంగా దర్శక, మహామహులైన కథారచయిత కలవాలాలకు
తునాతునాకలైందో... అర్థమైంది. ఎంత సుందరమైనది భారతం.
చాలా విషయాలు పంచుకోవాలి. నేను రాసే విషయాల్లో ఏమైనా
తప్పులుంటే.. వెంటనే ఖండించగలరు. రేపటి నుంచి కొన్ని భారత
వాస్తవాలు పంచుకుంటాను.

6 కామెంట్‌లు:

  1. మంచి ప్రయత్నం.
    కొనసాగించండి.
    శుభమస్తు.

    రిప్లయితొలగించండి
  2. బాగుంది....కొనసాగించండి మేము కూడా తెలుసుకుంటాం.

    రిప్లయితొలగించండి
  3. ఈ ప్రశ్నకి సమాధానం నాకు తెలుసోచ్చ్! కానీ మీరు చెప్పేదాకా ఆగుతాను, వ్రాసేయండి త్వరగా!

    రిప్లయితొలగించండి
  4. ఈ మధ్యనే నేను శ్రీ చాగంటి వారి ఉపన్యాసాలు వినడం మొదలు పెట్టాను. నిజమైన భారతం వుంటుంది ఆయన ప్రసంగాలలో. మీరన్నట్లుగానే ప్రచారం లో ఉన్న కథలు చాలా వరకు కల్పితాలే అనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  5. వారు బాగా చెప్తారు. నిజానికి చాలా కల్పిత కథలు ప్రచారంలో ఉన్నాయి.
    శకునికి వంద మంది తమ్ముళ్లని... వారందరిని దుర్యోధనుడు చెరబట్టి
    రోజుకో మెతుకు చొప్పున వేస్తే.. వారంతా కలిసి మెతుకు మెతుకూ కూడదీసి
    శకునిని బతికుంచుకున్నారని. తండ్రి చనిపోయాక ఆయన అస్తికలే
    పాచికలుగా మారాయని.. బహుళ ప్రచారంలో ఉన్న కథ. కానీ..
    ఈ కథకు వ్యాస భారతంలో ఎటువంటి ఆధారాలు లేవు. శకుని కథ వేరు.
    పోస్ట్ కి స్పందించినందుకు ధన్యవాదాలు. నేను రాసిన దాంట్లో
    తప్పులుంటే వెంటనే చెప్పండి. సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను.

    రిప్లయితొలగించండి