Powered By Blogger

20 జనవరి, 2017

ప్రశాంత నిద్ర కోసం...

అందరికీ నమస్సులు. ఇది పిల్లలకు చాలా ముఖ్యమైన శ్లోకం. రాముడు, హనుమంతుడు, గరుత్మంతుడు, భీముడు... వీళ్లంతా భయానికే భయం పుట్టించే ధీరులు. ఆ నలుగురిని స్మరిస్తే నిద్రలో పీడకలలు రావు. ప్రశాంతంగా పిల్లలు నిద్రపోతారు. నిద్రకు ముందు ఈ శ్లోకం పఠిస్తే... మెదడు ఆధ్యాత్మిక చింతనతో నిండుతుంది. పడుకునే ముందు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తే అదే కలగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని సైన్స్ చెప్తోంది. మరి ఆధ్యాత్మిక చింతనతో నిద్రపోతే... సైకాలజీ ప్రకారం చెడుకలలు వచ్చే అవకాశం లేదు. ఈ సైకాలజీ... మన పెద్దలకు ఎప్పుడో తెలుసు. అందుకే ఈ శ్లోకాన్ని పిల్లలతో పఠింపచేసి పడుకోమని చెప్తారు. ఈ కాలానికి తగ్గట్టు... పిల్లలకు ఈజీగా అర్థమయ్యేలా తెలుగు, ఇంగ్లీష్ లిరిక్స్ తో రూపొందించాం. వినండి, పిల్లలతో పాడించండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి